Sunday, October 5, 2025
Home Blog
0

ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన ఆర్మూర్ సబ్ కలెక్టర్ కు స్వాగతం.

— టియుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్.

ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ గారిని టియుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ తో పాటు బొడమీది నరేష్, గట్టడి పవన్, పోలపల్లి రాజేష్ మరియు వారి బృందం మర్యాదపూర్వకంగా కలిసి పూలమల శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.
ఆర్డిఓ గా విధులు నిర్వహించిన శ్రీ రాజా గౌడ్ గారికి పూలమాల శాలువాతో వీడ్కోలు ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా జిల్లా టియుడబ్ల్యూజే,ఐజేయు ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆర్డీవో గ రాజగౌడ్ విధులు అభినందనీయమని పేర్కొన్నారు.
అలాగే నేడు ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అభిగ్యాన్ మాళవీయ కు జర్నలిస్టుల సమస్యల గురించి వివరించారు.

నందిపేట్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.

0

నందిపేట్ మండలం లోని నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నందిపేట్. ఎస్ ఐ ఎం.చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నందిపేట్ లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎం.చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొని చెడు అలవాట్లు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలు, శిక్షలు వివరించారు. హెల్మెట్ వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాఫిక్ నిబంధనలు, యాంటీ రాగింగ్, డయల్ 100 యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, పెయింటింగ్ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, పరిపాలన అధికారి తులసి రామ్, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ లక్ష్మణ్ శాస్త్రి, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్, దుబాయ్ లొ ఆర్మూర్ అమ్మాయి

0

ఆర్మూర్ పట్టణానికి చెందిన సదమస్తుల రమణ (ఫిజికల్ డైరెక్టర్) సదమస్తుల సంధ్యారాణి దంపతుల కుమార్తె సదమస్తుల శ్రీయాన్షి ఈనెల 26వ తేది ఏప్రిల్ 2025 నాడు దుబాయ్, హ్యాబిటేట్ స్కూల్, అజ్మన్ లో జరగబోయే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్, దుబాయ్ 2025 సంవత్సరం నకు గాను అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైందని వీరి తల్లిదండ్రులు తెలియజేశారు. ఆర్మూర్ లోని నటరాజ నృత్య నికేతన్, డాక్టర్ మృణాళిని వద్ద శ్రీయాన్షి శిక్షణ పొందుతుందని తెలియజేశారు. ఆర్మూర్ లోని మోడల్ స్కూల్లో ఇటీవలే ఏడవ తరగతి పూర్తి చేసిందని తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయి దుబాయిలో పాల్గొంటున్నటువంటి శ్రీయన్షి ని వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు అభినందించడం జరిగింది.

నిజామాబాద్ జిల్లా లొ ఎకో టూరిజం!

0

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం

ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి

కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్ష

నిజామాబాద్, ఏప్రిల్ 22 : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్రె చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్ తో కలిసి సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి అటవీ, రెవెన్యూ, నీటి పారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం అనువైన పరిస్థితుల గురించి కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పిస్తే, తక్షణమే మంజూరీ తెలుపుతూ, నిధులు కేటాయిస్తామని అన్నారు. పరావరణాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎకో టూరిజం అభివృద్ధి చర్యలలో భాగంగా 25 సఫారీ వాహనాలను కొనుగోలు చేశామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధితో ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. నందిపేటలో ఎకో టూరిజం అభివృద్ధి పనులలో భాగంగా సఫారీ వాహనాల కొనుగోలు, వాచ్ టవర్, పార్కింగ్ ప్రదేశం, రెస్టారెంట్లను మొదటగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలు అయిన ఉమ్మెడలో 1.20 ఎకరాలు, జలాల్పూర్ లో 3 ఎకరాలలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మెడ నుండి బాసర వరకు బోటింగ్ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే ఉమ్మెడ నుండి గాదెపల్లి వరకు – 20 కి.మీ, గాదెపల్లి నుండి జలాల్పూర్ వరకు – 16 కి మీ సఫారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 3 రోజులలో సమగ్ర ప్రణాళికలు, కావల్సిన నిధుల వివరాలతో నివేదిక సమర్పిస్తే, వెంటనే బడ్జెట్ విడుదల చేస్తామన్నారు. ఈ సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల హాకీ సెలెక్షన్స్

0

(నిజం the truth): (March 13): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల హాకీ ఎంపికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ మాట్లాడుతూ తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆదేశాల మేరకు మార్చ్ 16,17,18 వ తేదీలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పురుషుల హాకీ టోర్నమెంట్ కు నిజామాబాద్ జిల్లా జట్టు ఎంపికలు ఈరోజు నిర్వహించడం జరిగింది మరియు ఎంపికైన జట్టు ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం హుజరాబాద్ కు బయలుదేరుతుందని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ ఎంపికైన జట్టును అభినందిస్తూ, మరియు రాష్ట్రస్థాయిలో మన జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ యొక్క ఎంపిక ప్రక్రియను జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్రా అంజు మరియు ఈసీ మెంబర్స సడక్ నాగేష్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు జిన్నా గంగాధర్, నర్సింగ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు.

0

ఆర్మూర్ మార్చి10: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తరువాతనే అన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు రిలే దీక్షలు – నిరసన కార్యక్రమాలు సోమవారం ప్రారంభించారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి మైలారం బాలు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట భద్దత కల్పించకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయడం ఆపాలని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్ని నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా మాదిగ నిరుద్యోగులు వర్గీకరణ లేక నష్టపోయారని అన్నారు.గ్రూప్ 1, గ్రూప్ 2 ,గ్రూప్ 3 యొక్క ఫలితాలను ఎస్సీ వర్గీకరణ అమలు పరచకుండా ఫలితాలను విడుదల చేయడం వల్ల మాదిగలకు నిరుద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్ట బద్దత కల్పించి గ్రూప్స్ ఉద్యోగాలలో మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద కపట ప్రేమ ఆపి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్ట భద్దత తెచ్చి మాదిగల పట్ల నిజమైన ప్రేమను చూపాలని చమత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మైలారం రాము మాదిగ, మాదిగ మహసేన సంఘం ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నాల చంద్ర శేఖర్(ఎమ్మార్పీఎస్ సీనియర్), ప్రధాన కార్యదర్శి బొడ్డు గోపి, జిల్లా అధ్యక్షుడు గంగాని స్వామి, ఏంఎస్పి నాయకులు సుద్ధపల్లి మార్కు, నాగం ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి నుతూపల్లి సంతోష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సంకెపల్లి విప్లవ్, ఎడపల్లి సంతోష్,మచ్ఛర్ల సునీల్ ,తరుణ్, బన్నీ,అజయ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్లో మున్సిపల్ అధికారుల తనిఖీ

0

నిజం the truth : నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమీషనర్ ఆదేశాలతో మామిడిపల్లి ఏరియాలో పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు హోటల్స్ పై సింగిల్ యూస్ ప్లాస్టిక్ మరియు పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పట్టుబడిన ప్లాస్టిక్ ని స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించడం జరిగింది ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది అక్షయ్, నరసయ్య పాల్గొన్నారు.

లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో మహిళలకు ఆర్ధిక అక్షరాస్యత

0

ఫిబ్రవరి 28 : ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా ‘పొదుపు చేసే మహిళా సాధిస్తుంది ఘనత’ అనే అంశం పై లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరమని, మహిళలు డబ్బులను పొదుపు చేసుకోవడానికి ప్రణాళికను రూపొందించుకోవాలని, అనవసరమైన ఖర్చులను తగ్గించి, వ్యాపార లావాదేవీల ద్వారా లాభాలు ఆర్జించడమే కాకుండా, ఆర్థికపరమైన నిర్వహణ అంశాల గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. అధిక వడ్డీ లకు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి అవసరాల కోసం రుణాలు తీసుకుంటే పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని, తద్వారా ఆర్థికంగా నష్టం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక అక్షరాస్యతను పాటించడం ద్వారా ఆర్ధిక పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్ లోని పలు దుకాణాలపై ప్లాస్టిక్ & పరిశుభ్రత పై తనిఖీలు.

0

ఆర్మూర్ లోని పలు దుకాణాలపై ప్లాస్టిక్ తనిఖీలు నిర్వహించడంతోపాటు పలు బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరియు హోటల్స్ లలో పరిశుభ్రత పై తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఈ తనిఖీలలో పట్టుబడిన ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించడం జరిగినది మరియు పట్టణంలోని 25 వ వార్డులో మహిళలకు తడి, పొడి మరియు హానికర చెత్తను విభజించి మున్సిపల్ వాహనాలకు అందించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఒక్కరు చెత్తను తడి,పొడి మరియు హానికర చెత్తగా విభజించి మునిసిపల్ వాహనాలకు అందించాలని హోటల్లు దుకాణాల వారు పరిశుభ్రతను పాటిస్తూ సింగిల్ ప్లాస్టిక్ను వాడకూడదని లేనిపక్షంలో చట్ట పరమైన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధించబడునని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, వార్డ్ ఆఫీసర్ సింధుజ ,ఆర్పీ లావణ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు ఎంపికైన శ్రీ భాషిత విద్యార్థులు.

0

ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో నిర్వహించిన అబాకస్ పోటీలలో, గొప్ప ర్యాంక్స్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా బుధవారం ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్, పొలపల్లి సుందర్ శుభాబినందనలు తెలియజేసారు. రాష్ట్రస్థాయి కి ఎంపికైన విద్యార్థులు ఫిబ్రవరి 2వ తారీకు హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు అబాకస్, స్పీడ్ మాథ్స్ వారికి ఒకటవ తరగతి నుండే గణితం పట్ల ఆసక్తిని కనబరచడానికి మరియు మెదడులో ఉండే నాడీ వ్యవస్థ పటిష్టత పెంచడానికి చాలా ఉపయోగపడుతుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు